హమ్మయ్య.. ఎట్టకేలకు తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పచ్చజెండా ఊపారు. శనివారం సాయంత్రం 6:30 గంటలకు నాలుగో సారి గవర్నర్ను విజయ్ కలిశారు. మద్దతు తెలిపిన పార్టీలతో విజయ్ గవర్నర్ కలిశారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగింది. మద్దతు లేఖలను పరిశీలించిన తర్వాత గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 3:45 నిమిషాలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయ్తో పాటు 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణస్వీకారానికి పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు.
