Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు
- దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్
- దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు
- ప్రజలు మాస్క్లు ధరించాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం భారీ దుమ్ము తుఫాన్ కప్పేసింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. నగరమంతా దుమ్ము తుఫాన్ కప్పేసింది. దీంతో ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దారి కనిపించక నానా తంటాలు పడ్డారు. రోడ్లపై ప్రయాణించే వాహనదారులైతే రహదారులు కనపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తక్కువ దూరం రోడ్డు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: IPS Couple Wedding: ఐపీఎస్ల పెళ్లితో ఎస్పీలో కుంపటి.. యూపీలో రాజకీయ దుమారం
Also Read
- Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 21 మంది మృతి, పలువురికి గాయాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
ఢిల్లీని తీవ్ర తుఫాన్ ఆవహించనుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. రోజంతా మేఘావృతమై కొన్నిచోట్ల స్వల్ప జల్లులు పడే అవకాశముందని… మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో గంటకు 20–30 కి.మీ వేగంతో గాలులు వీచి.. 40 కి.మీ వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
వర్ష సూచన..
ఏప్రిల్ 4 నుంచి 5 మధ్య ఒకటి లేదా రెండు సార్లు స్వల్ప నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని… ఈ సమయంలో ఉరుములు, మెరుపులు ఉంటాయని.. గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 6న మేఘావృతమై పెద్దగా వర్షం ఉండకపోవచ్చని పేర్కొంది. ఇక ఏప్రిల్ 7, 8 తేదీల్లో మళ్లీ స్వల్ప వర్షం, ఉరుములతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని.. ముఖ్యంగా దుమ్ము తుఫాన్ సమయంలో బయటకు వెళ్లేటప్పుడు మాస్క్లు ధరించాలని అధికారులు సూచించారు.
#WATCH | Delhi: The national capital experiences a severe dust storm that has significantly reduced visibility across the city.
(Visuals from Shanti Path) pic.twitter.com/OCCgsJN4JN
— ANI (@ANI) April 3, 2026
తాజావార్తలు
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!