Haridwar stampede: హరిద్వార్‌లోని మాన్సాదేవి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

  • హరిద్వార్‌లోని మాన్సాదేవి దేవాలయంలో తొక్కిసలాట..
  • మెట్ల మార్గంలో హైటెన్షన్ వైర్ తెగిపడటంతో విషాదం..
  • విద్యుత్ షాక్ భయంతో పరుగులు తీసిన భక్తులు..
  • ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి.. పలువురుకి గాయాలు..
  • మాన్సాదేవి ఆలయంలో తొక్కిసలాటపై సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆరా..
Haridwar

Haridwar

Haridwar stampede: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హరిద్వార్‌ లో గల మన్సాదేవి ఆలయం దగ్గర అపశ్రుతి జరిగింది. ఈరోజు (జూలై 27న) ఉదయం భారీ సంఖ్యలో భక్తులు టెంపుల్ కి తరలి వచ్చారు.. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడినట్లు గర్హ్వాల్‌ కమిషనర్‌ వినయ్ శంకర్ పాండే తెలియజేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక, ఆలయం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పుకొచ్చారు.

Read Also: Minister Thummala: తెలంగాణలో యూరియా కొరత..కేంద్రంపై తుమ్మల ఆగ్రహం

×
×
Ad

అయితే, ఆలయం దగ్గర ఉన్న హైటెన్షన్ వైర్ తెగిపడటంతో.. విద్యుత్ షాక్ కొడుతుందనే కారణంగా భయభ్రాంతులకు గురైన భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. విద్యుత్‌ షాక్‌కు గల కారణాలపై విచారణ చేస్తున్నాం.. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇది బాధాకరమైన విషయం.. ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.. అధికారులతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని సీఎం ధామి చెప్పుకొచ్చారు.