సౌతిండియాలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కర్ణాటకలో ప్రారంభమైంది. రూ.449 కోట్లతో బెంగళూరులో నిర్మించిన ఫ్లైఓవర్ను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్గా రికార్డు సృష్టించింది. 3.36 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్.. సిల్క్ బోర్డు జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ట్రాఫిక్ను సులభతరం చేయనుంది. రాగిగుడ్డ మెట్రో స్టేషన్ నుంచి ఫ్లైఓవర్ ప్రారంభం కానుంది. వాహనాల రాకపోకల కోసం ఎగువ డెక్లో ఎలివేటెడ్ మెట్రో కారిడార్ మరియు దిగువ డెక్లో ఎలివేటెడ్ రోడ్డును కలిగి ఉంది.
Bengaluru: సౌత్లో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం
- సౌత్లో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం
- బెంగళూరులో ప్రారంభించిన డీకే శివకుమార్
![Bengaluru](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/07/Bengaluru-1024x576.jpg)
Bengaluru