Sonam Raghuvanshi: భర్త వెనకాలే నడుస్తూ, వెన్నుపోటు పొడిచిన సోనమ్..
- హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు..
- భర్త వెనకాలే నడుస్తూ వెన్నుపోటు..
- అలసిపోయినట్లు నటిస్తూ, చంపేయాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Raghuvanshi: దేశవ్యాప్తంగా ‘‘హనీమూన్ మర్డర్’’ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ రఘువంశీ దారుణంగా హత్య చేయించింది. హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లే కాంట్రాక్టు కిల్లర్స్ సహాయంతో హతమార్చింది. ఈ కేసు తర్వాత, పెళ్లి అంటేనే మగాళ్లు భయపడేలా చేసింది. ఈ మొత్తం ప్లాన్ని సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా రూపొందించారు. ఆమె తన ముగ్గురు స్నేహితుల్ని కాంట్రాక్ట్ కిల్లర్స్గా నియమించుకుంది.
రాజా, సోనమ్ వివాహం జరిగిన 5 రోజుల తర్వాత తన చిన్ననాటి స్నేహితులైన ఆనంద్ కుమ్రి (23), ఆకాష్ రాజ్పుత్ (19), విశాల్ సింగ్ చౌహాన్ (22) లను మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని ఒక కేఫ్కు పిలిచి రాజాను హత్య చేయడానికి ప్లాన్ చేశారు. నేరం చేసేందుకు వీరిని డబ్బుతో ప్రలోభపెట్టారు. మే 20 రాజా, సోనమ్ మేఘాలయలో తమ హనీమూన్ కోసం బయలుదేరారు. వీరిని ముగ్గురు హంతకులు వెంబడించారు. మే 20న సోనమ్ లవర్ రాజ్ తన స్నేహితుల్ని మొదట గౌహతికి పంపించి, ఆ తర్వాత ఆన్లైన్లో గొడ్డలిని ఆర్డర్ చేసినట్లు తేలింది. అక్కడ నుంచి వారు షిల్లాంగ్కి వెళ్లి రాజా, సోనమ్ బస చేసిన హోటల్కి సమీపంలో ఉన్నారు.
Also Read
Read Also: Raj Kushwaha: నా కొడుకు నిర్దోషి.. ఏ పాపం తెలియదు.. సోనమ్ ప్రియుడి తల్లి ఆవేదన
ఈ జంట మొదటి మూడు రోజులు మేఘాలయ అందాలను వీక్షించారు. అయితే మే 23న ఫోటో షూట్ నెపంలో సోనమ్ కొండల్లోకి ట్రెక్కింగ్కి తీసుకెళ్లింది. అదే సమయంలో నిందితులు వీరిని వెంబడించారు. వీరి గురించి తెలియని రాజా వీరితో మాట్లాడుతూ వెళ్లాడు. అయితే, సోనమ్ అలసిపోయినట్లు నటిస్తూ, తన భర్త, హంతకుల వెనకాల చాలా దూరంగా నడుస్తూ వెళ్లింది. నిర్జన ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత సోనమ్ అతడిని చంపండి అంటూ అరిచినట్లు తేలిసింది.
అయితే, ఈ హత్య జరుగుతున్న సమయంలో సోనమ్ ప్రియుడు రాజ్ సీన్లో లేడు. అతను మేఘాలయ వెళ్లలేదని పోలీస్ వర్గాలు చెప్పాయి. కానీ, ఈ మొత్తం ప్లాన్లో సూత్రధారిగా ఉన్నాడు. ముందుగా ఇదంతా తెలియని కుటుంబీకులు, పోలీసులు ఈ జంట తప్పిపోయిందని వెతకడం ప్రారంభించారు. జూన్ 2న రాజా మృతదేహం అక్కడి లోయలో లభించింది. ఆ తర్వాత హత్యగా తేలింది. పోస్టుమార్టం నివేదికలో అతడిపై రెండుసార్లు దాడి జరిగినట్లు తేలింది. ఒకసారి తల వెనక భాగంలో, మరోసారి ముందు నుంచి దాడి చేశారు.
ఘటన తర్వాత 24 ఏళ్ల సోనమ్ శనివారం రాత్రి ఘాజీపూర్లోని ఒక ధాబాలో కనిపించింది. ఆమెను చికిత్స కోసం ఘాజీపూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ఆమె నేరాన్ని ఒప్పుకుంది. ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ముందుగా సోనమ తనను తాను బాధితురాలుగా చూపించే ప్రయత్నం చేసింది. చివరకు మొత్తం ప్లాన్ వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!