Drivers strike: నేడు దేశవ్యాప్తంగా ర్యాపిడో, ఓలా, ఉబెర్ డ్రైవర్ల స్ట్రైక్ చేపట్టింది. ఈ రోజు (ఫిబ్రవరి 7న) 6 గంటల పాటు “All India Breakdown” కు పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు స్ట్రైక్ కొనసాగనుంది. ఈ సందర్భంగా ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్ల ఆందోళనకు దిగారు. డ్రైవర్లు యాప్లను ఆఫ్ చేసి రైడ్స్కు నిరాకరిస్తున్నారు. పలు నగరాల్లో క్యాబ్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. కనీస బేస్ ఫేర్ లేకపోవడంపై డ్రైవర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Also: U19 World Cup Record: 92 శాతం విజయాలు.. అండర్-19 వరల్డ్కప్లో భారత్ డామినెన్స్!
అయితే, యాప్ కంపెనీల ఇష్టారాజ్యంగా ధరల నిర్ణయంతో డ్రైవర్ల ఆదాయం తగ్గుతుంది. కంపెనీలు ఎక్కువ కమిషన్లు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ప్రయాణ ఛార్జీలు అమలు చేయాలంటున్నారు. ఫేర్ నిర్ణయంలో యాప్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలకు ముగింపు పలకాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాలతో కమర్షియల్ రైడ్స్ నిషేధించాలని డిమాండ్.. ఫేర్ విధానం పారదర్శకంగా ఉండాలని, డిస్కౌంట్ పేరుతో డ్రైవర్లపై భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ స్ట్రైక్ తో ప్రయాణికులపై ప్రభావం పడనుంది. పీక్ అవర్స్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగనున్నాయి. ప్రజా రవాణాపై ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిమాండ్స్ నెరవేర్చకపోతే మరింత తీవ్రమైన ఉద్యమాలు, భవిష్యత్తులో దీర్ఘకాలిక స్ట్రైక్ చేస్తామని ర్యాపిడో, ఓలా, ఉబెర్ డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు.
