కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జమ్ము కాశ్మీర్ పర్యనటకు వెళ్లారు. ఇవాళ కటారాకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత.. అక్కణ్నుంచి కాలినడకన వైష్ణో దేవి యాత్ర ప్రారంభించారు. దారి మధ్యలో భక్తులతో కాస్సేపు ముచ్చటించారు రాహుల్. మొత్తం 14 కిలోమీటర్ల దూరం కాలినడక వెళ్లారు రాహుల్.. అమ్మవారి దర్శించుకోవడానికే వచ్చినట్టు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వైష్ణోదేవి పరిసరాలకు చేరుకున్న రాహుల్ గాంధీ.. రేపు ఉదయం అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇది పూర్తిగా రాహుల్ వ్యక్తిగత యాత్రనీ పార్టీ వర్గాలు అంటున్నాయి. నెలరోజుల్లో రాహుల్ జమ్మూ, కాశ్మీర్కు రావడం రెండోసారి. గతంలో పార్టీ ఆఫీసు ప్రారంభించేందుకు ఆయన శ్రీనగర్ వచ్చారు. ఇక, తమ నేతకు ఆహ్వానం పలికేందుకు పలువురు స్థానిక నేతలు పోటీ పడ్డారు. రేపు ఉదయం అమ్మవారిని దర్శించుకోనున్నారు రాహుల్ గాంధీ..
వైష్ణో దేవి యాత్రలో రాహుల్ గాంధీ.. రేపు అమ్మవారి దర్శనం..
