Site icon NTV Telugu

Lok sabha: పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా

Loksabha

Loksabha

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగిశాయి. మూడోరోజు ఎలాంటి చర్చ లేకుండానే నిరవధిక వాయిదా పడ్డాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్, నారీశక్తి వందన్ చట్టసవరణ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. దాదాపు 22 గంటల పాటు బిల్లులపై చర్చ జరిగింది. అయితే కేంద్రం ఉద్దేశపూర్వకంగానే మహిళా రిజర్వేషన్ బిల్లుతో డీలిమిటేషన్ బల్లు ముడిపెట్టిందని విపక్షం ఆరోపించింది. చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. మూడింట రెండొంతుల మెజార్టీ లేకపోవడంతో బిల్లులు వీగిపోయినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్రం తెలిపింది.

ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కేంద్రం ఏర్పాటు చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. దాదాపు 22 గంటల పాటు చర్చ చేపట్టిన తర్వాత ఓటింగ్ నిర్వహించింది. అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. మూడింట రెండొంతుల మెజార్టీ లేకపోవడంతో బిల్లులు వీగిపోయినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్రం తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు విపక్షాల తీరుకు నిరసనగా ఈ రోజు దేశ వ్యాప్తంగా ఎన్డీఏ పక్షాలు నిరసన తెల్పాలని డిసైడ్ అయ్యారు.

Exit mobile version