Site icon NTV Telugu

బెంగాల్‌లో మే 30వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు కొనసాగుతున్నాయి. తాజాగా మే 30 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను విధిస్తూ శనివారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అత్యవసర సేవలను అనుమతించడంతో పాటు, అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 3 గంటలు దుకాణాలు తెరిచి ఉంచేలా ఆదేశాలు జారీచేసింది. తాజాగా బెంగాల్ లో 20,846 మందికి కరోనా సోకగా.. 186 మంది ప్రాణాలు వదిలారు.

Exit mobile version