Khawaja Asif: పాకిస్తాన్ రక్షణ మంత్రి , నిత్యం భారత్ అంటే విషాన్ని వెళ్లగక్కే ఖవాజా ఆసిఫ్ నుంచి సంచలన ప్రకటన వచ్చింది. పాకిస్తానీ పిల్లలు తప్పుడు చరిత్రను నేర్చుకుంటున్నారని, పాకిస్తాన్ ప్రజలు తమ నిజమైన మూలాలకు దూరమవుతున్నారని ఆసిఫ్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పాకిస్తానీ ముస్లింలు మన హిందూ పూర్వీకుల్ని ద్వేషిస్తాము. పాకిస్తాన్లో సగం మంది ప్రజలు తమ పూర్వీకులు సౌదీ అరేబియా, ఇరాన్ నుంచి వచ్చారని తప్పుగా చెప్పుకుంటారు’’ అని అన్నారు. ఇదే కాకుండా పాకిస్తాన్ కొత్త తరం వారి సాంస్కృతిక గుర్తింపు నుంచి దూరం చేయడానికి ఈ మనస్తత్వాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్నారని అన్నారు.
పాకిస్తాన్లోని హిందూ పాలకుల చరిత్రను దాదాపుగా తుడిచిపెట్టేశారని ఆసిఫ్ అన్నారు. చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు హిందువులే కాబట్టి మనం వారి చరిత్రను పుస్తకాల నుంచి తొలగించామని అన్నారు. వీరి చరిత్ర పాకిస్తాన్లోని పిల్లలకు తెలియదని చెప్పారు. తన పూర్వీకులు హిందువులు, అంతమాత్రాన నేను పాకిస్తానీ కాకుండా పోతారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో పాకిస్తాన్ ఎప్పుడూ ఇజ్రాయిల్ను గుర్తించదని అన్నారు. ట్రంప్ ‘అబ్రహం ఒప్పందం’లో చేరాని పాక్పై ఒత్తిడి పెడుతున్న సమయంలో ఆసిఫ్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
