మనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. అందుకు ధర్మాసనం అనుమతిచ్చింది. మనీలాండరింగ్ కేసులో 2022, మే నెలలో సత్యేందర్ జైన్ అరెస్ట్ అయ్యారు.
Satyendar jain: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు బెయిల్
- మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రికి ఊరట
- రెండేళ్ల తర్వాత సత్యేందర్ జైన్కు ఢిల్లీ కోర్టు బెయిల్