Site icon NTV Telugu

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో డెల్టాప్ల‌స్ రోగి మృతి…అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం…

దేశంలో డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్ కు కార‌ణ‌మైంది.  ఈ వేరియంట్ కార‌ణంగానే రోజూ ల‌క్ష‌లాది కేసులు న‌మోద‌య్యాయి.  వేలాది మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  టీకాను వేగ‌వంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  అయితే, డెల్టా వేరియంట్ ఉత్ప‌రివ‌ర్త‌నం చేంది డెల్టాప్ల‌స్ వేరియంట్‌గా మారింది.  ఈ డెల్టాప్ల‌స్ కేసులు ఇండియాలో క్ర‌మంగా పెరుగుతున్నాయి.  మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల్లో కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఈ డెల్టాప్ల‌స్ వేరియంట్ ప్ర‌మాద‌కారి అని ఇప్ప‌టికే కేంద్రం హెచ్చ‌రించింది.  

Read: 40 ఏళ్ళ ‘ఊరికిచ్చిన మాట’

ఇక ఇదిలా ఉంటే, డెల్టాప్ల‌స్ వేరియంట్ సోకిన వ్య‌క్తి చికిత్స‌పొందుతూ మ‌ర‌ణించాడు.  ఈ తొలిమ‌ర‌ణం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యినిలో జ‌రిగింది.  డెల్టాప్ల‌స్ సొకిన రోగుల్లో ఒక‌రు మ‌ర‌ణించిన‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది.  అయితే, టీకా తీసుకొక‌పోవ‌డం వ‌ల‌నే ఆ వ్య‌క్తి మ‌ర‌ణించాడ‌ని, టీకా తీసుకున్న న‌లుగురు రోగులు డెల్టాప్ల‌స్‌ను జ‌యించార‌ని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.  ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా టీకా తీసుకోవాల‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి చేసింది. 

Exit mobile version