Site icon NTV Telugu

Delhi Weather: ఢిల్లీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న వాయు కాలుష్యం..

Delhi

Delhi

Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండగా, వాయు కాలుష్యం మాత్రం క్రమంగా పెరుగుతోంది. నగరం మొత్తం గ్యాస్ ఛాంబర్‌లా మారింది. దేశ రాజధానిలో AQI 400 పాయింట్లు దాటింది. కొన్ని హాట్‌ స్పాట్లలో 500 పాయింట్ల వరకు నమోదైంది. ఇక ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయింది.

Read Also: స్పార్క్లింగ్ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న మీనాక్షి చౌదరి..

అయితే, ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనూ విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. నగరంలో కాలుష్యం పెరగడంతో అధికారులు గ్రేడ్–4 చర్యలు అమలు చేస్తున్నారు. ఢిల్లీలోని అన్ని పాఠశాలల్లో హైబ్రిడ్ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) విధానంలో క్లాస్ లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సగం మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, మిగతా సగం మంది ఇంటి నుంచి పని చేసేలా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version