మాజీ ప్రధాని మన్మోహన్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్‌ విడుదల

అస్వస్థతకు గురైన భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు ఎయిమ్స్‌ వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కాగా, అస్వస్థతకు గురైన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. ఈ నెల 13వ తేదీన ఎయిమ్స్‌ చేరారు.. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని.. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌లో చేరినట్టు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే..