Site icon NTV Telugu

క‌రోనా దేవ‌త విగ్ర‌హం ప్ర‌తిష్ట‌.. 48 రోజుల మ‌హా య‌జ్ఞం

Corona Devi idol

క‌రోనా పేరు చెబితేనే అంతా ఉలిక్కిప‌డుతున్నారు.. క‌రోనా సోకిందంటే నా అనేవాళ్లు కూడా మ‌ళ్లిచూసే ప‌రిస్థితి లేకుండా పోయింది.. ఈ మ‌హ‌మ్మారిని తిట్టుకోని దేశం ఈ ప్ర‌పంచంలో లేకుండొచ్చు.. అయితే, దీనిని క్యాష్ చేసుకునేవాళ్లు సైతం లేక‌పోలేదు.. ఫార్మా కంపెనీలు, ప్రైవేట్ ఆస్ప‌త్రులు అందిన‌కాడికి పిండుకునే ప‌నిలోప‌డిపోయాయి. మ‌రోవైపు.. అంతా దెయ్యంగా చూస్తున్న క‌రోనా వైర‌స్‌ను దేవ‌త‌గా భావించేవారు కూడా లేక‌పోలేదు.. తమిళనాడులో ఏకంగా 48 అడుగుల కరోనా వైరస్ దేవత విగ్రహాన్ని ప్ర‌తిష్టించారు.. కోయంబత్తూరులోని కామత్చిపురిలోని 51వ శక్తి పీఠంలో కరోనా దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు స్థానికులు.. అంతేకాదు.. ప్రపంచాన్నిప‌ట్టిపీడిస్తోన్న కరోనా మ‌హ‌మ్మారి పోవడానికి, బాధితులకు అండగా నిల‌వ‌డానికి ఏకంగా 48 రోజుల పాటు మహా యజ్ఞం చేప‌ట్టారు ఆ పీఠంలోని స్వామీజీలు, పూజారులు, స్థానికులు.

Exit mobile version