B.Sc. Formula: బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కాదు!. బ్రాహ్మణులు, షెడ్యూల్డ్ కులాలట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
B.Sc. Formula: బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అని మాత్రమే మనకు తెలుసు. కానీ హిమాచల్ప్రదేశ్లోని బీజేపీ వేరే అర్థం చెబుతోంది. బీఎస్సీ అంటే బ్రాహ్మణులు, షెడ్యూల్డ్ కులాలంటోంది. ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సరికొత్త ఫార్ములాతోనే గెలవాలనుకుంటోంది. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ నాయకత్వంలో హిమాచల్ప్రదేశ్లో కమలనాథులు వరుసగా రెండోసారి విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆ రాష్ట్రానికి చెందినవారే. కాబట్టి పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. హిమాచల్ప్రదేశ్లో రాజ్పుత్లు 30 శాతం మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానం షెడ్యూల్డ్ కులాల(ఎస్సీల)దే. ఎస్సీలు 25 శాతం, బ్రహ్మణులు 19 శాతం, ఓబీసీలు 14 శాతం ఉన్నారు. మొత్తం 68 సీట్లు గల ఆ రాష్ట్ర అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే ముందుగా రాజ్పుత్లను ప్రసన్నం చేసుకోవాలి. జనరల్ సీట్లు 48 ఉండగా అందులో 33 కన్నా ఎక్కువ సీట్లలోనే రాజ్పుత్ల ఆధిపత్యం నెలకొంది.
Also Read
- Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
- Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
ఒక వైపు సీఎం జైరామ్ ఠాకూర్, మరో వైపు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తమ కులం ఓట్లు బీజేపీకే పడేలా కృషి చేస్తున్నారు. రాజ్పుత్లతోపాటు బ్రాహ్మణులను, షెడ్యూల్డ్ కులాల వారిని సైతం ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. బీఎస్సీ ఫ్యాక్టర్ను మాత్రమే పూర్తిగా నమ్ముకోకుండా హతీ వర్గాన్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే హతీ కమ్యూనిటీకి గిరిజన హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు సీఎం జైరామ్ ఠాకూర్ ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్షాని కలిశారు.
షెడ్యూల్డ్ కులాలతోపాటు ఇతర కులాల సంక్షేమం కోసం రాష్ట్రంలోని బీజేపీ సర్కారు వివక్షకు తావు లేకుండా ఎన్నో కార్యక్రమాలను అమలు చేసిందని, తద్వారా అన్ని వర్గాల ప్రజల మనసులను గెలుచుకున్నామని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. హిమాచల్ప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉనికిలోనే లేదని, జాతీయ కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం పోరాడుతోందని చెప్పారు.
తాజావార్తలు
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
-
South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?