BRICS Summit 2026: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ్టి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జరగనున్న BRICS 2026 సదస్సు నేపథ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో రైలు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. నార్తర్న్ రైల్వే ప్రత్యేక ఆపరేటింగ్ ప్లాన్ను ప్రకటించింది. ఇందులో భాగంగా పలు లోకల్ EMU, MEMU రైళ్లను రద్దు చేయడంతో పాటు, కొన్ని దూరప్రాంత రైళ్లను దారి మళ్లించనున్నారు. మరికొన్ని రైళ్లు సాధారణ టెర్మినల్స్కు బదులుగా ఇతర స్టేషన్ల నుంచి ప్రారంభం లేదా అక్కడే ముగియనున్నాయి.
సెప్టెంబర్ 11న పలు రైళ్లు రద్దు
సెప్టెంబర్ 11న పాల్వాల్-షకుర్బస్తీ, ఘాజియాబాద్-న్యూఢిల్లీ, న్యూఢిల్లీ-పాల్వాల్, ఢిల్లీ జంక్షన్-షామ్లీ మధ్య నడిచే పలు లోకల్ రైళ్లను రద్దు చేయనున్నారు. కొన్ని రైళ్ల రాకపోకల్లో కూడా మార్పులు చేశారు. అలీగఢ్ వెళ్లే రైలు న్యూఢిల్లీకి బదులుగా ఘాజియాబాద్ నుంచి బయలుదేరనుంది. బులంద్షహర్ వెళ్లే రైలు ఢిల్లీ షహదారా నుంచి ప్రారంభం కానుంది.
రాజధాని, సంపూర్ణ క్రాంతి రైళ్లకు దారి మళ్లింపు
సెప్టెంబర్ 11న న్యూఢిల్లీ-రాంచీ, న్యూఢిల్లీ-దిబ్రూగఢ్, న్యూఢిల్లీ-సీల్దా, న్యూఢిల్లీ-హౌరా, న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్లతో పాటు సంపూర్ణ క్రాంతి ఎక్స్ప్రెస్ను ప్రత్యామ్నాయ మార్గంలో నడపనున్నారు. న్యూఢిల్లీ-ఢిల్లీ జంక్షన్-సాహిబాబాద్ మార్గం మీదుగా ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. న్యూఢిల్లీ-హైదరాబాద్ ఎక్స్ప్రెస్, గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ 120 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. పశ్చిమ్ ఎక్స్ప్రెస్ 90 నిమిషాలు, న్యూఢిల్లీ-కాస్గంజ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ 75 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కానుంది.
సెప్టెంబర్ 12న మరిన్ని EMU రైళ్ల రద్దు
సెప్టెంబర్ 12న ఘాజియాబాద్, న్యూఢిల్లీ, పాల్వాల్, షకుర్బస్తీ, ఢిల్లీ జంక్షన్ మధ్య నడిచే మరిన్ని లోకల్ రైళ్లను రద్దు చేయనున్నారు. వీటిలో కొన్ని రద్దులు ఫరీదాబాద్ సెక్షన్లో కొనసాగుతున్న RLDA పనుల కారణంగా కూడా ఉన్నాయి. గోమతి ఎక్స్ప్రెస్, శ్రమజీవి ఎక్స్ప్రెస్, సీల్దా రాజధాని, హౌరా రాజధాని వంటి ముఖ్యమైన రైళ్లను ఢిల్లీ జంక్షన్, ఢిల్లీ షహదారా, సాహిబాబాద్ మీదుగా దారి మళ్లించనున్నారు. తేజస్ రాజధాని 25 నిమిషాలు, న్యూఢిల్లీ-భువనేశ్వర్ తేజస్ రాజధాని 20 నిమిషాలు, న్యూఢిల్లీ-రాజేంద్రనగర్ తేజస్ రాజ్ ఎక్స్ప్రెస్ 15 నిమిషాలు, అమృత్ భారత్ రైలు 35 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి.
సెప్టెంబర్ 13న కూడా రైళ్లపై ప్రభావం
సెప్టెంబర్ 13న కూడా రైళ్ల రద్దు, దారి మళ్లింపులు కొనసాగనున్నాయి. పాల్వాల్-ఘాజియాబాద్, ఘాజియాబాద్-ఢిల్లీ జంక్షన్, ఘాజియాబాద్-షకుర్బస్తీ, న్యూఢిల్లీ-ఘాజియాబాద్ EMU రైళ్లు రద్దు జాబితాలో ఉన్నాయి. బనారస్-న్యూఢిల్లీ సూపర్ఫాస్ట్ సహా పలు రైళ్ల మార్గాల్లో మార్పులు చేయనున్నారు. కొన్ని రైళ్లు తమ సాధారణ గమ్యస్థానాలకు చేరకముందే పాల్వాల్, ఘాజియాబాద్, షకుర్బస్తీ, హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ షహదారా వంటి స్టేషన్లలోనే ప్రయాణాన్ని ముగించనున్నాయి. తేజస్ రాజధాని, అమృత్సర్-విశాఖపట్నం హిరాకుడ్ ఎక్స్ప్రెస్ సహా కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేయనున్నారు.
ప్రయాణికులకు రైల్వే సూచనలు
BRICS సదస్సు కారణంగా రైళ్ల ఆపరేటింగ్ ప్లాన్లో చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నందున ఢిల్లీ-ఎన్సీఆర్ మీదుగా ప్రయాణించే వారు ముందుగా రైలు స్థితిని చెక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ద్వారా లేదా 139 రైల్వే హెల్ప్లైన్కు ఫోన్ చేసి తాజా సమాచారం తెలుసుకోవచ్చు. ప్రయాణానికి ముందు ప్రస్తుత రన్నింగ్ స్టేటస్ను తప్పనిసరిగా పరిశీలించాలని రైల్వే శాఖ సూచించింది.

