Site icon NTV Telugu

Bhopal: డిప్యూటీ కలెక్టర్ పై సంచలన ఆరోపణలు చేసిన భార్య

Untitled Design (19)

Untitled Design (19)

భోపాల్‌కు చెందిన డిప్యూటీ కలెక్టర్ భార్య.. తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. అతని అవినీతి గురించి.. పదవి దుర్వినియోగం.. లంచం తీసుకోవడం.. అనధికార విదేశీ పర్యటనల గురించి ప్రస్తావించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉజ్జయినిలో జరిగిన బహిరంగ విచారణలో తబస్సుమ్ బానో తన భర్త మొహమ్మద్ సిరాజ్ మన్సూరి తనను బెదిరిస్తున్నాడని.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆమె ఆరోపించింది. తన భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని ఆమె వ్యక్తం చేసింది. తన భర్త దుష్ప్రవర్తనల గురించి తబస్సుమ్ బానో వివరించిన వివరణ అధికారులంతా షాక్ కు గురయ్యారు.

SDM లక్ష్మీనారాయణ గార్గ్ కు వివాదానికి సంబంధించిన అనేక ఆధారాలను సమర్పించారు. గత మంగళవారం ఆమె ఇండోర్‌లో జరిగిన బహిరంగ విచారణలో కూడా ఫిర్యాదు చేసింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.2008లో వివాహం చేసుకున్నారని ఆమె చెప్పారు. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తూ చాలా డబ్బు సంపాదించాడు మరియు వివిధ నగరాల్లో ఇళ్ళు, దుకాణాలు, బంగ్లాలు, ప్లాట్లు మరియు ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడన్నారు.

ప్రభుత్వానికి తెలియజేయకుండా తన దుర్మార్గపు కార్యకలాపాలు, ఆనందం కోసం మన్సూరి థాయిలాండ్, ఇరాక్, దుబాయ్ మొదలైన ప్రదేశాలకు కూడా అనేకసార్లు విదేశాలకు వెళ్లాడని చెప్పారు. అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని తబస్సుమ్ బానోకు సూచించారు.

Exit mobile version