సాధారణంగా బిక్షగాడు చనిపోతే అతనికి ఎవరు ఉండరేమో అని మనసున్న వారు ఖననం చేస్తారు.. కానీ ఇప్పుడు ఓ యాచకుడు మరణం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది.. 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యాచకుడి వద్ద లక్షల నగదు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.. ఆ యాచకుడి దగ్గర దాదాపు లక్షకు పైగా డబ్బులు ఉన్నాయి.. అలాంటి అతను తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు..
ఆసుపత్రిలో చేరిన కాసేపటికే అతను చనిపోయాడు.. పోస్టుమార్టం నివేదికలో ‘ఆకలి’ అతని చావుకు కారణమని అధికారులు తెలిపారు. అంత డబ్బు ఉన్న ఆకలితో ఎందుకు చనిపోయాడు? అతనికి ఆ డబ్బు ఎలా వచ్చింది? వంటి ఎన్నో ప్రశ్నలు పోలీసుల బుర్రలను తొలుస్తున్నాయి.. అసలు అతను ఎవరు అనే ఆలోచన జనాలను ఆలోచనలో పడేస్తుంది..
ఇక వల్సాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గాంధీ లైబ్రరీ సమీపంలోని రోడ్డు పక్కన గత రెండు రోజులుగా అదే స్థలంలో బిచ్చగాడు పడి ఉండటాన్ని ఓ దుకాణం యజమాని గమనించాడు. ఇక అతను 108కి డయల్ చేసి ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించాడు. వృద్ధుడికి సృహరాగానే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ భవేష్ పటేల్ అతని వద్దకు వెళ్లి మాట్లాడారు. ప్రాథమిక పరీక్షల అనంతరం చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బిచ్చగాడు చనిపోయాడు. రోజుల తరబడి ఆకలితో అలమటించడం మూలంగా వృద్ధుడు మరణించినట్లు వల్సాద్ సివిల్ హాస్పిటల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.. అంత డబ్బులు ఉంచుకొని అతను ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో తెలియాల్సి ఉంది..