Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. తనపై 40 మందికి పైగా దాడి చేసి, అసభ్యంగా ప్రర్తించారని, అసభ్య పదజాలంతో దూషించారని ఓ ఆర్మీ జవాన్ భార్య ఆదివారం ఆరోపించారు. ఈ ఘటన వేలూరులో జరిగింది. తనను అనుచితంగా తాకినట్లు ఆమె పేర్కొన్నారు. మా కుటుంబాన్ని ప్రశాంతంగా బతకనివ్వమని, బెదిరిస్తున్నట్లు బాధిత మహిళ ఆరోపించారు. శనివారం తనను అర్ధనగ్నంగా చేసి కొట్టారని ఆమె ఆరోపించారు.
Read Also: Bandi Sanjay: నోరు జారిన బండి సంజయ్.. ఎంత పెద్ద మాట అన్నారు సార్
జవాన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తిరువన్నామలై ఎస్పీ కార్తికేయ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు రాము, హరిప్రసాద్ లను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఒక సివిల్ తగాదా కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఒక సివిల్ తగాదా వల్ల దాడి జరిగనట్లు తెలుస్తోందని ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. ఆర్మీ జవాన్ భార్యపై దాడి చేసి వేధింపులకు పాల్పడినవారిపై నిష్పక్షపాత దర్యాప్తుతో న్యాయం చేయాలని అన్నారు.
"More than 40 people attacked me. They verbally abused me with obscene language. They touched me inappropriately. They are not allowing our family to live. They are threatening me," says wife of the Army jawan in Vellore, Tamil Nadu
In a viral video, an Army jawan's wife was… https://t.co/FMtKrjDiF9 pic.twitter.com/TD4pzssWEZ
— ANI (@ANI) June 11, 2023