Site icon NTV Telugu

Goa: వాటర్‌ఫాల్స్‌ వద్ద చిక్కుకున్న పర్యాటకులు.. 50 మంది రెస్క్యూ, మరో 30 మంది కోసం..

Goa

Goa

Goa: గోవాలోని పాలి జలపాతం వద్ద 80 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చారు. భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో వీరంతా చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ జలపాతం గోవాలోని సత్తారి తాలూకాలో ఉంది. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది సహాయంతో ప్రస్తుతం జలపాతం వద్ద రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని ఎస్పీ అక్షత్ కౌశల్ తెలిపారు.

Read Also: JP Nadda JK Visit: రెండోరోజూ జమ్మూకశ్మీర్ పర్యటనలో నడ్డా..జమ్మూ ఎయిమ్స్ సందర్శన

వర్షాలు కురుస్తుండటంతో జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే నదిని దాటాల్సి ఉంటుంది. భారీ వర్షాల వల్ల జలపాతం వద్ద నీటి ప్రవాహం పెరగడంతో 80 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వీరిలో 50 మందిని అధికారులు రక్షించారు. మిగిలిన 30 మందిని కాపాడేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Exit mobile version