దేశంలో కరోనా కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. రోజు రోజుకు కేసులు, మృతుల సంఖ్య ప్రభుత్వాలకు సవాల్ విసురుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాగా కర్ణాటకలోని విజయపుర జిల్లా తొరవి గ్రామంలో కరోనా రెండో దశ మొదలైన నాటి నుంచి 70 మంది కొవిడ్ కాటుకు బలయ్యారు. అందులో 40 మంది ఒక్క నెలలోనే కరోనాతో చనిపోవడం ఆ గ్రామాన్ని కలవరపెడుతుంది. మాజీ మంత్రి ఎమ్బీ పాటిల్ ఈ విషయం వెల్లడించారు. పాటిల్ ఈ విషయాన్ని చెప్పిన తర్వాత వెంటనే ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి కరోనా పరీక్షలు చేపట్టారు.
ఒకే గ్రామంలో 40 మంది కరోనా కాటుకు బలి
