టెలివిజన్ నటి, యూట్యూబర్ సిరి హన్మంతు సోషల్ మీడియా వేదికగా సరికొత్త ఆదాయ మార్గానికి తెరలేపారు. ‘జబర్దస్త్’ షోతో కెరీర్ మొదలుపెట్టి, బిగ్బాస్ తెలుగు సీజన్-5తో పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ‘పెయిడ్ సబ్స్క్రిప్షన్’ (Paid Subscription) ఫీచర్ను ప్రారంభించి తన అభిమానులకు షాకిచ్చారు. సెలబ్రిటీలు సోషల్ మీడియాను కేవలం పబ్లిసిటీ కోసమే కాకుండా, పక్కా కమర్షియల్ ఆదాయ వనరుగా మార్చుకుంటున్న క్రమంలో సిరి వేసిన ఈ అడుగు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
సిరి షేర్ చేసే ఎక్స్క్లూజివ్ ఫోటోలు, షూటింగ్ బిహైండ్ ద సీన్స్, ఆమె పర్సనల్ లైఫ్ అప్డేట్స్ చూడాలంటే నెటిజన్లు నెలకు రూ. 449 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే స్పెషల్ లైవ్ సెషన్లు, ప్రాధాన్యతతో కూడిన రిప్లైలు అందుతాయని ఆమె వెల్లడించారు. గతంలో యాంకర్ విష్ణుప్రియ ఇలాంటి ప్రయత్నం చేసి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, సిరి మాత్రం తన వీరాభిమానుల కోసం ఈ ‘వీఐపీ యాక్సెస్’ను అందుబాటులోకి తెచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఆమె వ్యాపార దృక్పథాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వసూళ్లు ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
