Raaz Actress: ఒకప్పుడు భయంకరమైన లుక్తో ప్రేక్షకులను వణికించిన ‘రాజ్’ సినిమా నటి మాలినీ శర్మ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్కు దూరంగా ఉంటున్న మాలినీ శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారారు. ఆమెను గుర్తుపట్టిన అభిమానులు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్, మెసేజ్లు చేయడంతో ఆమె కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇంతకాలం మాలినీ శర్మ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?
2002లో విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ ‘రాజ్’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బిపాషా బసు, డినో మోరియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మాలినీ శర్మ దెయ్యం పాత్రలో హల్చల్ చేసింది. పెద్దగా డైలాగ్స్ లేకపోయినా, ఆమె లుక్, హావభావాలు, భయపెట్టే స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల ఒంట్లో వణుకు పుట్టించాయి. దీంతో ఆ సినిమా చూసిన చాలామందికి మాలినీ శర్మ పోషించిన దెయ్యం పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోయింది.
అయితే ‘రాజ్’ తర్వాత మాలినీ శర్మ కెరీర్ మాత్రం ఊహించిన స్థాయిలో కొనసాగలేదు. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఆమె, సినిమాల్లోకి రాకముందు పలు మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించారు. ‘ఆప్కే ప్యార్ మే’ వంటి పాటల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘క్యాట్స్’ అనే టీవీ సిరీస్లో కూడా నటించారు. కానీ బాలీవుడ్లో ఎక్కువకాలం కొనసాగకుండా ఆమె క్రమంగా సినిమాలకు దూరమయ్యారు.
సినీ ప్రపంచానికి దూరమైన తర్వాత మాలినీ శర్మ తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు. సినిమా షూటింగ్స్, కెమెరాలు, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన లైఫ్ స్టైల్ ను గడుపుతున్నారు. ప్రస్తుతం పూణే సమీపంలోని సహ్యాద్రి కొండల్లో ‘ది స్లో లోకల్’ అనే ఫామ్స్టేను నిర్వహిస్తున్నారు. ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ఫామ్స్టే ఒక ప్రత్యేక అనుభూతిని అందించేలా ఉంటుంది.
ఇటీవల సోషల్ మీడియాలో మాలినీ శర్మకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను ‘రాజ్’ సినిమాలోని దెయ్యం పాత్రతో పోల్చుకుంటూ గుర్తుపట్టారు. దీంతో ఒక్కసారిగా ఆమె ఫామ్స్టేకు ఫోన్ కాల్స్, మెసేజ్లు వెల్లువెత్తాయి. ఇంత భారీ స్థాయిలో స్పందన వస్తుందని తాను ఊహించలేదని మాలినీ శర్మ స్వయంగా వెల్లడించారు. ఈ అభిమానానికి స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసిన మాలినీ శర్మ, తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, ఇంత ప్రేమను చూసి తరువాత తన భావాలను మాటల్లో చెప్పలేకపోతున్నానని భావోద్వేగానికి గురయ్యారు.
ఇన్స్టాగ్రామ్లో కూడా తనకు భారీగా మెసేజ్లు వస్తున్నాయని తెలిపారు. వీలైనంతవరకు ప్రతి ఒక్కరికీ స్పందించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. దాదాపు 20 ఏళ్లకు పైగా సినీ ప్రపంచానికి దూరంగా ఉన్న ఆమెను అభిమానులు మళ్లీ గుర్తు చేసుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిగా ఉందని మాలినీ శర్మ స్పందించారు.
ఒకప్పుడు ‘రాజ్’ సినిమాలో దెయ్యంగా ప్రేక్షకులను భయపెట్టిన మాలినీ శర్మ, ఇప్పుడు అదే సినీ ప్రపంచానికి పూర్తిగా భిన్నమైన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కెమెరాల ముందు కనిపించకుండా ప్రకృతి మధ్య ఫామ్స్టే నిర్వహిస్తూ తనకంటూ మరో ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. అయితే సోషల్ మీడియా కారణంగా ఆమె గతం మరోసారి అందరి ముందుకు వచ్చింది. దీంతో మాలినీ శర్మ పేరు ప్రస్తుతం మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది.

