మలయాళ అగ్రకథానాయకుడు మోహన్లాల్ను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. నటుడు, దర్శకుడు, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవల్ని గుర్తించి.. 2023 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. మోహన్లాల్ అద్భుత సినీ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తేలిపారు. ఈ నెల 23న జరిగే 71వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో మోహన్లాల్ను ఈ అవార్డుతో సత్కరించనున్నారు.
Also Read : Vedhika : గ్లామర్ విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వేదిక..
ఈ ఘనతపై మోహన్లాల్ భావోద్వేగంగా మాట్లాడుతూ.. “ఈ గొప్ప అవార్డు నా జీవితంలో అత్యుత్తమ క్షణాలలో ఒకటిగా ఉంటుంది. విన్నప్పుడు నిజంగానే ‘ఇది నిజమేనా?’ అని అనిపించింది. ఈ అవార్డును కేవలం నాకే కాకుండా తోటి కళాకారులు, దర్శకులు, నిర్మాతలు, సెట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు మరియు అభిమానులతో పంచుకోవాలనుకుంటున్న’ అని తెలిపారు. మోహన్లాల్ వెల్లడించినట్లుగా, ఈ అవార్డు కేవలం వ్యక్తిగత సాధనకే పరిమితం కాకుండా భారతీయ సినీ పరిశ్రమలో ప్రతి వ్యక్తి కృషికి గౌరవం. ఈ ఘనత ఆయన జీవితంలో గర్వకరమైన క్షణంగా నిలుస్తూ, భవిష్యత్లో మరిన్ని మైలురాళ్లను సృష్టించడానికి ప్రేరణగా మారనుంది.
#WATCH | Kochi, Kerala: On being conferred the Dadasaheb Phalke Award, actor Mohanlal says, "With so much pride, humility, gratitude, love and respect, I am accepting this great award. I think this is one of the finest moments in my life. When I heard that I got this, I thought,… pic.twitter.com/0K9NEKMjUB
— ANI (@ANI) September 21, 2025
