Site icon NTV Telugu

Midhunam: టాలీవుడ్ లో మరో విషాదం…

Midhunam

Midhunam

తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, లక్ష్మీ లాంటి నటులతో ‘మిథునం’ అనే మంచి సినిమాని ప్రొడ్యూస్ చేశాడు ‘మొయిద ఆనంద రావు’. ఎలాంటి కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా మంచి సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన ఆనంద రావు కన్ను మూసారు. మధుమేహంతో చాలా కాలం నుండి బాధపడుతున్న ఆనంద రావు, గత కొన్ని రోజులుగా అస్వస్ధగా ఉండటం తో వైజాగ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ వున్నారు. బుధవారం నాడు పరిస్థితి విషమించటంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది, బుధవారం ఉదయం ఆనంద రావు ౫౭ ఏళ్ల వయసులో కన్ను మూసారు. ఆనందరావు కి భార్య పద్మిని, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం వావిలవలసలో జరగనున్నాయి.

Exit mobile version