Site icon NTV Telugu

Mahesh Babu : సెట్లో మహేష్ బాబు చిలిపి పని.. నిర్మాతకు ఒకటే ‘మ్యూజిక్కు’

Mahesh Babu

Mahesh Babu

మహేష్ బాబు హీరోగా, గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఒక్కడు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబుకి మాస్ లో ఒక క్రేజీ ఇమేజ్ తీసుకొచ్చింది ఈ సినిమా. అయితే, తాజాగా ఈ సినిమా గురించి గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. నిజానికి ఆ సినిమాలో మహేష్ బాబు, పాస్‌పోర్ట్ ఆఫీసర్ అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని ఫోన్ కాల్స్ ద్వారా టీజ్ చేసే ఓ సీన్ ఉంటుంది. అయితే, అలా టీజ్ చేసేలా సీన్ రాసుకున్నాక ఒక ఫోన్ నెంబర్ ఏదైనా పెడితే బాగుంటుందని అనుకున్నామని, కానీ మహేష్ బాబు వచ్చి ఎమ్మెస్ రాజు నెంబర్ పెట్టమని అన్నారని చెప్పుకొచ్చారు.

Also Read :Ram Charan : ఎన్టీఆర్ డ్రైవింగ్ అంటే చాలా భయం.. రాం చరణ్ షాకింగ్ కామెంట్స్

“ఆ నెంబర్ పెడితే ఆయనకి మాత మోగిపోద్ది, ఎందుకు అవసరమా?” అని అడిగితే, “పర్లేదు పెట్టండి” అని నా చేత ఫోన్ నెంబర్ పెట్టించాడని ఈ సందర్భంగా గుణశేఖర్ గుర్తు చేసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగానే నిర్మాతకు ఫోన్ కాల్స్ తో మాత మోగిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ సీన్ లో మహేష్ స్నేహితుడు అయిన ఓ పాత్ర ‘లడ్డు’ అని ఉంటుంది. ఆ పాత్ర పేరుతోనే పిలుస్తూ “ఏరా లడ్డు” అంటూ ఎమ్మెస్ రాజు గారికి ఫోన్లు చేసేవారు అని చెప్పుకొచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోన్ కాల్స్ భరించారు కానీ, ఒకవేళ తేడా పడి ఉంటే రాజుగారికి ఇంకా ఇబ్బంది అయ్యేది అంటూ ఈ సందర్భంగా గుణశేఖర్ చెప్పుకొచ్చారు. గుణశేఖర్ త్వరలోనే ‘యుఫోరియా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భూమిక, సారా అర్జున్ ప్రధాన పాత్రలలో ఈ సినిమా రూపొందింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ కూడా రిలీజ్ అయింది.

Exit mobile version