న్యూస్ ప్రజెంటర్ నుండి హీరోయిన్గా ఛేంజైన చెన్నై పొన్ను ప్రియా భవానీ శంకర్ అనతికాలంలోనే యాక్ట్రెస్గా ఐడెంటిటీని దక్కించుకుంది. సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ.. సెల్ఫ్ మేడ్ హీరోయిన్గా మేకోవర్ అయ్యింది. కోలీవుడ్లో ఫ్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్లో మాత్రం సక్సెస్ కోసం స్ట్రగుల్ ఫేస్ చేస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు చేసిన త్రీ మూవీస్ ఫ్లాప్సే.
సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన కళ్యాణం కమనీయంతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది ప్రియా భవానీ శంకర్. కానీ ఈ సినిమా వచ్చి పోయిన విషయం తెలియదు ఆడియన్స్కు. కానీ దూత వెబ్ సిరీతో చేరువైంది. ఇందులో నాగ చైతన్య భార్యగా కరెప్టెడ్ జర్నలిస్ట్గా నటించింది. ఈ సిరీస్.. గోపీచంద్తో భీమ, సత్య దేవ్ జీబ్రాలో నటించే తెచ్చిపెట్టింది కానీ, ఈరెండు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో టీటౌన్లో అవకాశాలు తగ్గాయి. కోలీవుడ్ ఆఫర్స్తో కాలం నెట్టుకొస్తున్న ప్రియాకు.. మరొక ఛాన్స్ ఇస్తోంది టాలీవుడ్ . శివ నిర్వాణ- రవితేజ కాంబోలో తెరకెక్కుతోన్న ఇరుముడిలో నటిస్తోంది. రవితేజకు భార్యగా కావేరి పాత్రలో కనిపించబోతుంది. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఫిల్మ్. షూటింగ్ కంప్లీట్ కావడంతో సెట్స్లోని పిక్స్ సోషల్ మీడియాలో పంచుకుంది ప్రియ. అలాగే దూత సీక్వెల్లోనూ కంటిన్యూ కాబోతుంది. రీసెంట్లీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ప్రియా ఫ్లాప్స్ పట్టించుకోకుండా టాలీవుడ్ ఆఫర్స్ ఇస్తోంది.. మరీ మేడమ్ వాటిని సద్వినియోగం చేసుకుంటుందో లేదో.

