NTV Telugu Site icon

Tollywood : హనుమాన్ నిర్మాత మరో భారీ బడ్జెట్ చిత్రం..హీరో ఎవరంటే..?

Untitled Design (10)

Untitled Design (10)

టాలివుడ్ లో ఈ  ఏడాది విడుదలై అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రాలలో హనుమాన్ ముందు వరుసలో ఉంటుంది. తేజ సజ్జా హీరోగా, విలక్షణ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించాడు. చిన్న చిత్రంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది.

ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా జై హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. మొదటి భాగం కంటే  ఎక్కువ బడ్జెట్ తో జై హనుమాన్ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం జై హనుమాన్ చిత్రం కోసం దాదాపు రూ. 200కోట్ల బడ్జెట్ ను నిర్మాత నిరంజన్ రెడ్డి కేటాయించినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.తేజా సజ్జాతో పాటు ఈ మరొక స్టార్ హీరో ఈ చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతానికి ఆ హీరో ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. చూడాలి మరి పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ చిత్రంలో ఏ స్టార్ హీరో నటిస్తాడో.

ఇదిలా ఉండగా ప్రైమ్ షో ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ లో మరో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారంట నిర్మాత నిరంజన్ రెడ్డి. రామాయణం నేపథ్యంలో ఈ కథ ఉండనుందని, భారీ బడ్జెట్ తో రాజేష్ అనే సినిమాటోగ్రాఫర్ ను దర్శకుడిగా పరిచయం పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందని సమాచారం. మరి ఈ చిత్రంలో రాముడిగా ఎవరు నటిస్తారోన్న ఆసక్తి ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఎక్కువగా ఉంది.

Also Read : December Clash: అన్ని వేళ్లు పుష్పా వైపే..అసలు కారణం ఏంటంటే..?