గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది .ఈ సినిమాను అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది.
దర్శకుడు శంకర్ ‘గేమ్ఛేంజర్’సినిమా తో పాటు విశ్వనటుడు కమల్హాసన్ తో ‘ఇండియన్-2’ చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. దీంతో ఆయన ‘గేమ్ఛేంజర్’ చిత్రం కోసం శంకర్ తన పూర్తి సమయాన్ని కేటాయించలేదు. ఈ కారణంగా “గేమ్ ఛేంజర్” షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే రాంచరణ్ నటించిన ‘గేమ్ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడు అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాలి.. ఈ సినిమాలో రాంచరణ్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు సమాచారం.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి మరో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్ మరియు నవీన్చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు .
