Site icon NTV Telugu

సుకుమార్ భార్యకు ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలు

Tabitha to takes over Sukumar Writings

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “పుష్ప” చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్రోల్ చేస్తున్నారు. కాగా తాజాగా సుకుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ భార్య తబిత ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలు చేపట్టింది. సుకుమార్ సహచరుడు, ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలను నిర్వహించే ప్రసాద్ అనే వ్యక్తి మార్చి 28న గుండెపోటు కారణంగా కన్నుమూశారు. దీంతో ఇప్పుడు ఆ బాధ్యతలను సుకుమార్ తన భార్యకు అప్పగించారు. ఇప్పటి నుంచి సుకుమార్ గైడెన్స్ లో ఆమె ఈ బ్యానర్ ను నడిపించనున్నారు. సుకుమార్ రైటింగ్స్ 2014 లో స్థాపించబడింది. తన బ్యానర్‌లో కుమారి 21 ఎఫ్ (2015) చిత్రంతో సుకుమార్ చిత్ర నిర్మాతగా మారారు. అతను దర్శకుడు, 100% కాదల్, ఉప్పెన వంటి చిత్రాలకు మద్దతు ఇచ్చాడు. ప్రస్తుతం తన బ్యానర్ లో నిఖిల్ హీరోగా నటించిన “18 పేజెస్” ను నిర్మిస్తున్నారు సుకుమార్.

Exit mobile version