Site icon NTV Telugu

కోవిడ్-19 రిలీఫ్ కోసం సన్ టీవీ భారీ విరాళం

Sun TV donates Rs.30 crores to India's Fight Against Covid-19 pandemic

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అది సృష్టిస్తున్న అల్లకల్లోలానికి ఎంతోమంది బలైపోయారు. ఇంకా చాలామంది కరోనాతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా రిలీఫ్ కోసం సహాయాన్ని అందించడానికి పలు సంస్థలు, పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా భారత్ కరోనా బాధితులను ఆదుకోవడానికి కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ గా భారీ విరాళాన్ని హైరాబాద్ సన్ రైజర్స్ ప్రకటించారు. రూ.30 కోట్ల భారీ విరాళాన్ని అందజేయనున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా ప్రభావితమైన బాధితులకు అండగా నిలిచేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మాతృ సంస్థ సన్ టివి నెట్‌వర్క్ రూ.30 కోట్లు విరాళంగా ఇస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కోవిడ్-19 రిలీఫ్ కార్యక్రమాల కోసం ఈ నిధులను ఉపయోగించబోతున్నాము. ఆక్సిజన్ సిలిండర్లు, మెడిసిన్ సరఫరా తదితర కార్యక్రమాలపై ఎన్జిఓ లతో భాగస్వామ్యమవుతాము. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మీడియా ద్వారా అవగాహన కల్పిస్తాము’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు సన్ టీవీ వారు.

Exit mobile version