యంగ్ హీరోయిన్ ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘శివంగి’. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ థ్రిల్లర్ మూవీలో ఆనంది, వరలక్ష్మి శరత్కుమార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లు అందించారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల్ని కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది.
Also Read: Coolie : ‘కూలీ’ తెలుగు హక్కుల కోసం భారీ డిమాండ్..
ఇందులో భాగంగా తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా ఈ మూవీ సడెన్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘శివంగి’ మూవీ గురువారం నుంచి అంటే నేటి నుండి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆహా ఓటీటీ సంస్థ వెల్లడించింది.. అలాగే ‘ఒకరోజు. జీవితాంతం పోరాటం. సత్యభామ కథ మిమ్మల్ని ప్రతిదానికి ప్రశ్నించేలా చేస్తుంది. అది హత్యా లేక ఆత్మహత్యా?’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
