Site icon NTV Telugu

Rama Charan: ‘జగదేక వీరుడు’కి నాగ్ అశ్విన్ సీక్వెల్ చేయాలి.. రామ్ చరణ్ డిమాండ్

Ram Charan

Ram Charan

మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ హిట్ విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మే 9న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిరంజీవి, అశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు సినిమా జ్ఞాపకాలను పంచుకున్నారు. రామ్ చరణ్ వీడియో బైట్‌లో మాట్లాడుతూ, “‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఓ డ్రీమ్ టీం సృష్టి. చిరంజీవి, శ్రీదేవి, అశ్వనీదత్, రాఘవేంద్రరావు, ఇళయరాజా, విన్సెంట్, యండమూరి వంటి మహానుభావులు కలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇలాంటి టీం, ఇలాంటి క్లాసిక్ మళ్లీ రాదు. మా తరానికి ఇదే డ్రీమ్ టీం. సినిమా చివరలో చూపించిన రింగ్ ఏమైంది? ఆ చేప ఎక్కడుంది? ఈ ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానం చెప్పాలి. ఇది వినతి కాదు, మా డిమాండ్” అని పేర్కొన్నారు.

Exit mobile version