Preethizinta : ఎనిమిదేళ్ల విరామం తర్వాత బిగ్ స్క్రీన్‌పై ప్రీతి జింటా

Preethizinta

Preethizinta

బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిన ‘డింపుల్ క్వీన్’ ప్రీతి జింటా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఆమె బిగ్ స్క్రీన్‌పై అడుగుపెడుతుండటంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు వరస హిట్‌లతో బాలీవుడ్ రారాణిగా వెలిగిన ప్రీతి, పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ‘ది హీరో’, ‘దిల్లగి’, ‘భయ్యాజీ సూపర్‌హిట్‌’ వంటి చిత్రాల తర్వాత మళ్లీ సన్నీ డియోల్ సరసన కథానాయికగా నటిస్తుండటం ఈ కమ్‌బ్యాక్‌కు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది.

ప్రీతి జింటా రీ-ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా సాధారణమైన ప్రాజెక్ట్ కానే కాదు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ స్వయంగా తన ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. 1947 నేపథ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ పిరియాడికల్ డ్రామాకు ‘బట్వారా 1947’ అనే టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. సన్నీ డియోల్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌తోనే ప్రీతి జింటా చాన్నాళ్ల తర్వాత మళ్లీ తన నటనతో అలరించడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విలక్షణ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, దిగ్గజ రచయిత జావేద్ అఖ్తర్ సాహిత్యం సమకూర్చారు. షబానా అజ్మీ, ఆలీ ఫజల్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ భారీ పిరియాడిక్ మూవీ ప్రీతి జింటా కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలవబోతోంది. మానవీయ సంబంధాలు, దేశ విభజన నాటి కష్టాల చుట్టూ తిరిగే ఈ కథలో ప్రీతి జింటా అత్యంత బలమైన, ఎమోషనల్ రోల్‌లో కనిపించబోతున్నారు. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటనకు విపరీతమైన ఆస్కారమున్న ఈ పాత్రతో తన సెకండ్ ఇన్నింగ్స్‌లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు ప్రీతి సిద్ధమవుతున్నారు.