ఒకప్పుడు బాలీవుడ్ ఆఫర్ల కోసమో లేదా సినిమాల ప్రమోషన్ల కోసమో దక్షిణాది నటీనటులు ముంబైకి వెళ్లేవారు. కానీ ఇప్పుడు పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు దుమ్మురేపుతుండటంతో ముంబై మహానగరం కూడా దక్షిణాది తారలకు మరో సొంత ఇల్లుగా మారుతోంది. బాలీవుడ్ గుండెకాయ లాంటి బాంద్రా, జూహూ, లోఖండ్వాలా వంటి ప్రైమ్ లోకేషన్లలో సౌత్ స్టార్స్, దర్శకులు వందల కోట్ల విలువైన లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తూ, భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
ముంబైలో సౌత్ స్టార్స్ లగ్జరీ ఇళ్లు – అంచనా ధర :
| ప్రాపర్టీ | ధర రూ. | |
| ధనుష్ | లోఖండ్వాలా హోమ్ | ₹150 కోట్లు |
| రామ్ చరణ్ | బాంద్రా పెంట్ హౌస్ | ₹80 కోట్లు |
| సూర్య | ముంబై హోమ్ | ₹70 కోట్లు |
| అట్లీ | బాంద్రా సీ-ఫేసింగ్ హోమ్ | ₹38 కోట్లు |
| పృథ్వీరాజ్ సుకుమారన్ | బాంద్రా డ్యూప్లెక్స్ | ₹30.6 కోట్లు |
| యష్ | ఆలీబాగ్ ప్రాపర్టీ | ₹24 కోట్లు |
| సమంతా | ముంబై అపార్ట్మెంట్ | ₹15 కోట్లు |
| అల్లు అర్జున్ | జూహూ పెంట్ హౌస్ | ₹16 లక్షలు (నెలకు అద్దె) |
పాన్-ఇండియా సినిమాల హవా నడుస్తుండటంతో వరుస షూటింగ్లు, బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, ముంబై ఆధారిత ప్రాజెక్ట్ల కోసం దక్షిణాది తారలు తరచూ ముంబైలోనే సమయాన్ని గడపాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే హోటళ్లలో ఉండటానికి బదులుగా తమదైన శైలిలో కోట్లాది రూపాయలతో లగ్జరీ పెంట్ హౌస్లు, డ్యూప్లెక్స్ ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జూహూలో లగ్జరీ పెంట్ హౌస్ కోసం ప్రతినెల రూ. 16 లక్షల అద్దె చెల్లిస్తుండగా, ధనుష్ ఏకంగా రూ. 150 కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసాడు. ఈ పరిణామం ఇండియన్ సినిమాలో సౌత్ స్టార్లకు పెరుగుతున్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది.

