డ్రాగన్ కోసం లూగర్ రంగంలోకి దిగాడా? అంటే, అవుననే అంటున్నారు. ఇటీవల ఎన్టీఆర్కు డ్రాగన్ సినిమా షూటింగ్లో గాయమైన సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ చేశారు వైద్యులు. అలాగే.. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో డ్రాగన్ షూటింగ్ డిలే అవుతూ వస్తోందనే టాక్ వినిపిస్తునే ఉంది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవనున్నాడు. కానీ లేటెస్ట్గా తారక్ ఈ సినిమా సెట్స్లోకి అడుపెట్టినట్టుగా తెలుస్తోంది.
షోల్డర్ సర్జరీ నుంచి కోలుకున్న ఎన్టీఆర్.. డ్రాగన్ షూటింగ్లో మళ్లీ చురుగ్గా పాల్గొంటున్నారట. తాజా సమాచారం ప్రకారం, రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించి కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో భాగంగా ముందుగా కీలకమైన టాకీ పార్ట్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. టాకీ పోర్షన్ పూర్తయిన తర్వాత, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ మాస్ మేనియాను నెక్స్ట్ లెవెల్లో చూపించేలా ఈ యాక్షన్ బ్లాక్స్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డ్రాగన్ షూటింగ్ చాలా డిలే అయింది. ఎప్పుడో థియేటర్లోకి రావాల్సిన ఈ సినిమా.. వచ్చే ఏడాది జూన్కి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి పోస్ట్పోన్ కాకుడదని వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా.. పవర్ ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్.

