NTV Telugu Site icon

బిగ్​బాస్​ సెట్​ సీజ్

మలయాళ మెగాస్టార్​ మోహన్​లాల్​ హోస్ట్ గా వ్యవహరిస్తున్న మలయాళ బిగ్​బాస్ సీజన్​ 3 ​షూటింగ్​ను తమిళనాడు పోలీసు అధికారులు నిలిపివేశారు. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్​సిటీలో ఈ షో కోసం వేసిన షూటింగ్​ సెట్​ను సీజ్​ చేశారు. కరోనా ఆంక్షలు ఉల్లంఘించి చిత్రీకరణ జరిపించారు. కాగా, బిగ్ బాస్ హౌస్ లో పనిచేసే వారిలో మొత్తం 6 మందికి కరోనా సోకింది. అయినా కూడా నిర్వాహకులు షోని నిలిపివేయకుండా రహస్యంగా కంటిన్యూ చేశారు. ఈ సమాచారం బయటకు రావడంతో తమిళనాడు అధికారులు బిగ్ బాస్ హౌస్ పై దాడులు నిర్వహించారు. కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తున్న నేపథ్యంలో మే 31 వరకు చిత్రీకరణలను నిలిపివేయాలని ఫిల్మ్​ ఎంప్లాయిస్​ ఫెడరేషన్​ ఆఫ్​ సౌత్​ ఇండియా ఆదేశించిన.. ప్రోటోకాల్​ను ఉల్లంఘించి ఈ షో షూటింగ్​ను జరిపారు.