NTV Telugu Site icon

Allari Naresh : ఆ సినిమాతో మళ్ళీ సొంత గ్రౌండ్ లో ఆడుతున్నట్లు వుంది..

Whatsapp Image 2024 05 02 At 7.20.26 Am

Whatsapp Image 2024 05 02 At 7.20.26 Am

కామెడీ స్టార్ అల్లరి నరేష్ ఒకప్పుడు కామెడీ చిత్రాలకు బ్రాండ్ గా నిలిచేవారు.అయితే గత కొంతకాలంగా నాంది ,ఉగ్రం వంటి సీరియస్‌ సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.అయితే ఈ సారి మళ్ళి రూటు మార్చి మరోసారి కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .తాజాగా మరోసారి కామెడీ సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందని అల్లరి నరేష్‌ తెలిపారు.ఆయన నటించిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకురానుంది.రాజీవ్‌ చిలకా నిర్మిస్తున్న ఈ చిత్రంతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం అల్లరి నరేష్‌ ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసారు .

ఈ సినిమాకి నాన్నగారి సినిమా టైటిల్‌ పెట్టడంతో ఆ చిత్రంతో పోలుస్తారెమో అని భయపడ్డాను.కథకు తగ్గట్లు సరిపోతుందని ఆ టైటిల్ పెట్టడం జరిగిందని నరేష్ తెలిపారు.ఈ సినిమాలో హీరోకి వయసు ముదురుతున్న పెళ్లి కాదు, అందరూ పెళ్లెప్పుడు..అని అడుగుతుంటారు. ఆ చిరాకులో చెప్పే డైలాగే ‘ఆ ఒక్కటీ అడక్కు’..పెళ్లి గురించి నడిచే ఈ కథతో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చినట్లు నరేష్ తెలిపారు.మా దర్శకుడు మల్లి నిజ జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.ఈ సినిమా క్లైమాక్స్ ఎంతో ఎమోషనల్ గా సాగుతుందని నరేష్ తెలిపారు.అయితే గత కొన్నేళ్లుగా సీరియస్ చిత్రాలు చేస్తున్న ఇప్పుడు మళ్ళీ కామెడీ సినిమా చేస్తుండటంతో నా సొంత గ్రౌండ్ లో ఆడుతున్న ఫీలింగ్ కలుగుతుందని అల్లరి నరేష్ తెలిపారు .