మెగాస్టార్ చిరంజీవి తాజాగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కొత్తగా ఎన్నికైన సభ్యులను కలిశారు. ఈ సమావేశంలో TFJA ప్రతినిధులు తమ అసోసియేషన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు గురించి చిరంజీవికి వివరించారు. అసోసియేషన్ సభ్యులు చెప్పారు, సినిమా రంగంలో కష్టపడే జర్నలిస్టుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ వంటి పథకాలను అమలు చేస్తున్నారు, ప్రమాదం లేదా అనారోగ్యం వచ్చినప్పుడు వారికి తక్షణ సహాయం అందించడం ప్రధాన లక్ష్యం అని. భవిష్యత్తులో జర్నలిస్టుల కోసం హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ ఏర్పాట్ల కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. చిరంజీవి అసోసియేషన్ కార్యక్రమాలను అభినందిస్తూ, జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సహాయం ఎప్పుడు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో TFJA అధ్యక్షుడు వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, కోశాధికారి సురేందర్ కుమార్ నాయుడు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిరంజీవి ప్రశంసలతో అసోసియేషన్ సభ్యుల్లో కొత్త ఉత్సాహం నింపబడింది.
Also Read : Shah Rukh Khan: అలియా ‘ఆల్ఫా’లో షారుక్ ఖాన్ సీక్రెట్ రోల్..?
సినిమాల విషయానికి వస్తే, చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర్’ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, విశ్వంభర్ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయనున్నారు. ఈ రెండు సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
