Site icon NTV Telugu

Megastar Chiranjeevi: అల్లూరి జయంతి వేడుకలు.. చిరును ఆహ్వానించిన కిషన్ రెడ్డి

Chiru

Chiru

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలకు భీమవరం ముస్తాబవుతోంది. అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలను జూలై 4న భీమవరం లో నిర్వహించనున్న విషయం విదితమే. ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. ఆరోజు భీమవరంలోని పెద అమీరం ప్రాంతంలో అల్లూరి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు.

ఇకపోతే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చిరంజీవికి ఆహ్వానం పంపారు. తప్పకుండా ఈ వేడుకకు హాజరై అల్లూరి జయంతి వేడుకల్లో పలు పంచుకోవాలని కోరారు. ఒక్కరోజే కాకుండా ఏడాది పాటు ఈ వేడుక వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగనున్నట్లు తెలిపారు. ఇక చిరు సైతం కిషన్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించి వేడుకకు వస్తామని తెలిపినట్లు సమాచారం.

Exit mobile version