NTV Telugu Site icon

వూహాన్‌లో 11 వేల మంది విద్యార్ధులు ఒకే చోట‌…

క‌రోనాకు పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలోని వూహ‌న్ న‌గ‌రంలో ఒకే చోట 11 వేల మంది విద్యార్ధులు మాస్క్‌లు లేకుండా గుమిగూడారు.  సోష‌ల్ డిస్టెన్స్ లేకుండా పక్క‌పక్క‌నే కూర్చున్నారు.  వూహాన్‌లోని విశ్వ‌విద్యాల‌యం స్నాత‌కోత్స‌వంలో భాగంగా జరిగిన వేడుక‌లో ఈ సంఘ‌ట‌న జరిగింది.  ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఒక‌చోట ప‌దిమంది క‌లిసి కూర్చోవాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు.  క‌లిసి తిర‌గాలంటే ఆంధోళ‌న చెందుతున్నారు.  మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు రావ‌డంలేదు.  2019 డిసెంబ‌ర్ నెల‌లో వూహాన్ న‌గ‌రంలో తొలి క‌రోనా కేసు నమోదైంది. ఆ త‌రువాత క‌రోనా ప్ర‌పంచం మొత్తానికి వ్యాపించింది.  ప్రపంచం అంతా ఒక‌లా ఉంటే, చైనాలో మాత్రం క‌రోనా అన్న‌ది ఒక‌టి ఉంద‌నే విష‌యం మ‌రిచిపోయి ప్ర‌జ‌లు స్వేచ్చ‌గా తిరుగుతున్నారు.  జ‌న‌జీవ‌నం సాధార‌ణంగా మారిపోయింది.