Death and Brain: మరణానికి ముందు ఏం జరుగుతుంది.? చివరి క్షణాల్లో మెదడు ఏం చేస్తుంది..
- మరణం తర్వాత కొన్ని క్షణాల పాటు యాక్టీవ్గా మెదడు..
- అన్ని అవయవాలు షట్డౌన్ అయినా, వర్క్ మోడ్లో బ్రెయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death and Brain: మరణం అనేది తప్పించుకోలేని ఒక నిజం. పుట్టిన ప్రతీ జీవి కూడా చనిపోవాల్సిందే. అయితే, ఆ చివర క్షణాలు మానవుడిని అయోమయంలో పడేస్తాయి. శరీరం నెమ్మదిస్తుంది, శ్వాసలో మార్పులు, హృదయ స్పందన పడిపోవడం, అవయవాలు చల్లబడటం జరుగుతుంది. చివరకు ప్రాణంపోయి విగతజీవిగా మారుతారు. అయితే, మరణానికి ముందు అన్ని శరీర అవయవాలు నెమ్మదిగా ఆగిపోతుంటాయి. ఆ సమయంలో మన శరీరాన్ని కంట్రోల్ చేసే మెదడు ఏం చేస్తుందనే సందేహాలు ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలను వేధిస్తున్నాయి.
అయితే, శాస్త్రీయ అధ్యయనాల, మరణానికి దగ్గర వెళ్లి వచ్చిన వారి అనుభవాల ద్వారా మెదడు కార్యకలాపాల గురించి మనకు కొంత సమాచారాన్ని అందిస్తుంది. గుండె ఆగిపోయిన క్షణంలోనే మెదడు తన పనిని ఆపేయదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బదులుగా కొన్ని మెదడు తరంగాలు, ముఖ్యంగా గామా డోలనాలు పెరగొచ్చు. ఇవి జ్ఞాపకశక్తి, కలలు కనడం, తీవ్రమైన ఆలోచనలతో ముడిపడి ఉంటాయి. కొంతమందికి జీవితం మొత్తం ఒక ఫ్లాష్లా కనిపిస్తుంది. తమకు ప్రియమైన వారి ఫోటోలు కనిపిస్తాయి. దీనినే పరిశోధకులు ‘‘లైఫ్ రీకాల్’’గా పిలుస్తారు.
Also Read
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
- Saudi-Houthi: పశ్చిమాసియాలో కొత్త ఘర్షణ.. సౌదీ-హౌతీ మధ్య దాడులు..పాక్ రంగంలోకి దిగుతుందా?
Read Also: Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటిటి + టీవీ హక్కులు అప్డేట్
ఒక రీసెర్చ్లో గుండెపోటు వచ్చిన రోగిలో శాస్త్రవేత్తలు మెదడు తరంగాలను ట్రాక్ చేశారు. హృదయస్పందన ఆగిపోయిన 30 సెకన్ల ముందు మెదడులో కొన్ని అసాధారణ కార్యకలాపాలు జరిగాయి. ఇవి మనం కలలు కంటున్నప్పుడు, ఏదైనా సంఘటనను గుర్తు చేసుకుంటున్నప్పుడు, జ్ఞాపకశక్తికి సంబంధించిన తరంగాలతో పోలి ఉన్నాయి. ఈ చివర క్షణాల్లో మెదడు కీలక జ్ఞాపకాలను తిరిగి పొందే విధానంలో భాగమని పరిశోధకులు చెబుతున్నారు. చావు దగ్గర దాకా వెళ్లొచ్చిన చాలా మంది ప్రకాశవంతమైన కాంతిని లేదా తెలిసిన కొందరి ముఖాలనను చూశామని చెప్పారు.
గుండె ఆగిపోయినప్పుడు మెదడుకు రక్త ప్రవాహం, ఆక్సిజన్ వేగంగా తగ్గుతుంది. మరణానికి ముందు శరీరంలో ఎండార్ఫిన్లు, ఇతర మెడదు రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి భయం, నొప్పిని తగ్గిస్తాయి. కాబట్టి దాదాపుగా మరణించే వ్యక్తులలో ప్రశాంతవంతమై, నిర్మలమైన భావాలు కనిపించడానికి మెదడులో రసాయనిక చర్యలే కారణమని చెబుతున్నారు. అయితే, అందరికి ఒకేలా అనుభవాలు ఉండకపోవచ్చు. వ్యక్తిగత మెదడు ప్రతిస్పందనకు తగ్గట్లుగా చివరి క్షణాలు ఉండొచ్చని చెబుతున్నారు.
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!