Death and Brain: మరణానికి ముందు ఏం జరుగుతుంది.? చివరి క్షణాల్లో మెదడు ఏం చేస్తుంది..
- మరణం తర్వాత కొన్ని క్షణాల పాటు యాక్టీవ్గా మెదడు..
- అన్ని అవయవాలు షట్డౌన్ అయినా, వర్క్ మోడ్లో బ్రెయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death and Brain: మరణం అనేది తప్పించుకోలేని ఒక నిజం. పుట్టిన ప్రతీ జీవి కూడా చనిపోవాల్సిందే. అయితే, ఆ చివర క్షణాలు మానవుడిని అయోమయంలో పడేస్తాయి. శరీరం నెమ్మదిస్తుంది, శ్వాసలో మార్పులు, హృదయ స్పందన పడిపోవడం, అవయవాలు చల్లబడటం జరుగుతుంది. చివరకు ప్రాణంపోయి విగతజీవిగా మారుతారు. అయితే, మరణానికి ముందు అన్ని శరీర అవయవాలు నెమ్మదిగా ఆగిపోతుంటాయి. ఆ సమయంలో మన శరీరాన్ని కంట్రోల్ చేసే మెదడు ఏం చేస్తుందనే సందేహాలు ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలను వేధిస్తున్నాయి.
అయితే, శాస్త్రీయ అధ్యయనాల, మరణానికి దగ్గర వెళ్లి వచ్చిన వారి అనుభవాల ద్వారా మెదడు కార్యకలాపాల గురించి మనకు కొంత సమాచారాన్ని అందిస్తుంది. గుండె ఆగిపోయిన క్షణంలోనే మెదడు తన పనిని ఆపేయదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బదులుగా కొన్ని మెదడు తరంగాలు, ముఖ్యంగా గామా డోలనాలు పెరగొచ్చు. ఇవి జ్ఞాపకశక్తి, కలలు కనడం, తీవ్రమైన ఆలోచనలతో ముడిపడి ఉంటాయి. కొంతమందికి జీవితం మొత్తం ఒక ఫ్లాష్లా కనిపిస్తుంది. తమకు ప్రియమైన వారి ఫోటోలు కనిపిస్తాయి. దీనినే పరిశోధకులు ‘‘లైఫ్ రీకాల్’’గా పిలుస్తారు.
Also Read
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
Read Also: Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటిటి + టీవీ హక్కులు అప్డేట్
ఒక రీసెర్చ్లో గుండెపోటు వచ్చిన రోగిలో శాస్త్రవేత్తలు మెదడు తరంగాలను ట్రాక్ చేశారు. హృదయస్పందన ఆగిపోయిన 30 సెకన్ల ముందు మెదడులో కొన్ని అసాధారణ కార్యకలాపాలు జరిగాయి. ఇవి మనం కలలు కంటున్నప్పుడు, ఏదైనా సంఘటనను గుర్తు చేసుకుంటున్నప్పుడు, జ్ఞాపకశక్తికి సంబంధించిన తరంగాలతో పోలి ఉన్నాయి. ఈ చివర క్షణాల్లో మెదడు కీలక జ్ఞాపకాలను తిరిగి పొందే విధానంలో భాగమని పరిశోధకులు చెబుతున్నారు. చావు దగ్గర దాకా వెళ్లొచ్చిన చాలా మంది ప్రకాశవంతమైన కాంతిని లేదా తెలిసిన కొందరి ముఖాలనను చూశామని చెప్పారు.
గుండె ఆగిపోయినప్పుడు మెదడుకు రక్త ప్రవాహం, ఆక్సిజన్ వేగంగా తగ్గుతుంది. మరణానికి ముందు శరీరంలో ఎండార్ఫిన్లు, ఇతర మెడదు రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి భయం, నొప్పిని తగ్గిస్తాయి. కాబట్టి దాదాపుగా మరణించే వ్యక్తులలో ప్రశాంతవంతమై, నిర్మలమైన భావాలు కనిపించడానికి మెదడులో రసాయనిక చర్యలే కారణమని చెబుతున్నారు. అయితే, అందరికి ఒకేలా అనుభవాలు ఉండకపోవచ్చు. వ్యక్తిగత మెదడు ప్రతిస్పందనకు తగ్గట్లుగా చివరి క్షణాలు ఉండొచ్చని చెబుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!