Death and Brain: మరణానికి ముందు ఏం జరుగుతుంది.? చివరి క్షణాల్లో మెదడు ఏం చేస్తుంది..
- మరణం తర్వాత కొన్ని క్షణాల పాటు యాక్టీవ్గా మెదడు..
- అన్ని అవయవాలు షట్డౌన్ అయినా, వర్క్ మోడ్లో బ్రెయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death and Brain: మరణం అనేది తప్పించుకోలేని ఒక నిజం. పుట్టిన ప్రతీ జీవి కూడా చనిపోవాల్సిందే. అయితే, ఆ చివర క్షణాలు మానవుడిని అయోమయంలో పడేస్తాయి. శరీరం నెమ్మదిస్తుంది, శ్వాసలో మార్పులు, హృదయ స్పందన పడిపోవడం, అవయవాలు చల్లబడటం జరుగుతుంది. చివరకు ప్రాణంపోయి విగతజీవిగా మారుతారు. అయితే, మరణానికి ముందు అన్ని శరీర అవయవాలు నెమ్మదిగా ఆగిపోతుంటాయి. ఆ సమయంలో మన శరీరాన్ని కంట్రోల్ చేసే మెదడు ఏం చేస్తుందనే సందేహాలు ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలను వేధిస్తున్నాయి.
అయితే, శాస్త్రీయ అధ్యయనాల, మరణానికి దగ్గర వెళ్లి వచ్చిన వారి అనుభవాల ద్వారా మెదడు కార్యకలాపాల గురించి మనకు కొంత సమాచారాన్ని అందిస్తుంది. గుండె ఆగిపోయిన క్షణంలోనే మెదడు తన పనిని ఆపేయదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బదులుగా కొన్ని మెదడు తరంగాలు, ముఖ్యంగా గామా డోలనాలు పెరగొచ్చు. ఇవి జ్ఞాపకశక్తి, కలలు కనడం, తీవ్రమైన ఆలోచనలతో ముడిపడి ఉంటాయి. కొంతమందికి జీవితం మొత్తం ఒక ఫ్లాష్లా కనిపిస్తుంది. తమకు ప్రియమైన వారి ఫోటోలు కనిపిస్తాయి. దీనినే పరిశోధకులు ‘‘లైఫ్ రీకాల్’’గా పిలుస్తారు.
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
Read Also: Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటిటి + టీవీ హక్కులు అప్డేట్
ఒక రీసెర్చ్లో గుండెపోటు వచ్చిన రోగిలో శాస్త్రవేత్తలు మెదడు తరంగాలను ట్రాక్ చేశారు. హృదయస్పందన ఆగిపోయిన 30 సెకన్ల ముందు మెదడులో కొన్ని అసాధారణ కార్యకలాపాలు జరిగాయి. ఇవి మనం కలలు కంటున్నప్పుడు, ఏదైనా సంఘటనను గుర్తు చేసుకుంటున్నప్పుడు, జ్ఞాపకశక్తికి సంబంధించిన తరంగాలతో పోలి ఉన్నాయి. ఈ చివర క్షణాల్లో మెదడు కీలక జ్ఞాపకాలను తిరిగి పొందే విధానంలో భాగమని పరిశోధకులు చెబుతున్నారు. చావు దగ్గర దాకా వెళ్లొచ్చిన చాలా మంది ప్రకాశవంతమైన కాంతిని లేదా తెలిసిన కొందరి ముఖాలనను చూశామని చెప్పారు.
గుండె ఆగిపోయినప్పుడు మెదడుకు రక్త ప్రవాహం, ఆక్సిజన్ వేగంగా తగ్గుతుంది. మరణానికి ముందు శరీరంలో ఎండార్ఫిన్లు, ఇతర మెడదు రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి భయం, నొప్పిని తగ్గిస్తాయి. కాబట్టి దాదాపుగా మరణించే వ్యక్తులలో ప్రశాంతవంతమై, నిర్మలమైన భావాలు కనిపించడానికి మెదడులో రసాయనిక చర్యలే కారణమని చెబుతున్నారు. అయితే, అందరికి ఒకేలా అనుభవాలు ఉండకపోవచ్చు. వ్యక్తిగత మెదడు ప్రతిస్పందనకు తగ్గట్లుగా చివరి క్షణాలు ఉండొచ్చని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!