NTV Telugu Site icon

Hezbollah Deputy: ఇజ్రాయెల్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం..

Israil

Israil

Hezbollah Deputy: ఇజ్రాయెల్‌తో పోరాడుతూనే ఉంటామని హిజ్బుల్లా యొక్క డిప్యూటీ లీడర్ నయీమ్ కస్సెమ్ ప్రతిజ్ఞ చేశాడు. హసన్ నస్రల్లా మరణించిన తర్వాత హిబ్బుల్లా సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉందని కస్సెమ్ చెప్పాడు. నస్రల్లా హత్యకు గురైన తర్వాత ఇజ్రాయెల్ పై దాడిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం.. ఇజ్రాయెల్ గత 10 రోజులలో నస్రల్లా సహా ఆరుగురు అగ్ర కమాండర్‌లను చంపిందని అతడు చెప్పుకొచ్చారు. మా (సైనిక) సామర్థ్యాలను ఇజ్రాయెల్ ఏమాత్రం ప్రభావితం చూపించలేకపోయిందని పేర్కొన్నారు. త్వరలోనే ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హిజ్బుల్లా డిప్యూటీ లీడర్ నయీమ్ కస్సెమ్ అన్నారు.

Read Also: Game Changer : ఆకట్టుకుంటున్న ‘రా మచ్చా.. మచ్చా’ సాంగ్‌…

ఇక, ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున సెంట్రల్ బీరుట్‌లో వైమానిక దాడిలో ఓ అపార్ట్‌మెంట్ ను నేలమట్టం చేసింది. కాగా, హసన్ నస్రల్లా మరణం తర్వాత అతడి స్థానంలో హిజ్బుల్లా చీఫ్ గా ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకునే వరకు నయీమ్ కస్సేమ్ ప్రస్తుతం తాత్కాలిక నాయకుడిగా కొనసాగనున్నారు. అలాగే, ఇజ్రాయెల్ చేసిన దాడిలో లెబనాన్‌లో 1,000 మందికి పైగా మరణించగా.. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.. దీంతో పాటు ఒక మిలియన్ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయినట్లు లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.