బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియా (80) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తుది శ్వాస విడిచారు.
ఖలీదా జియా బంగ్లాదేశ్లో రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఖలీదా జియా చరిత్ర సృష్టించారు. భర్త జియావుర్ రెహమాన్ మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, జైలు శిక్ష అనుభవించినా ప్రజాస్వామ్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు.
