Uttarpardesh: దారుణం.. దళిత బాలిక హత్య.. తర్వాత ఏం చేశారంటే..

  • లాల్ పూర్ శివరాజ్ పూర్ గ్రామంలో బాలిక హత్య
  • భడోరియా అనే యువకుడు హత్య చేసినట్లు ఆరోపణ
  • నిందితుడి అరెస్ట్... విచారణ చేపట్టిన పోలీసులు
Untitled Design (2)

Untitled Design (2)

ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత బాలిక హత్య ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. గ్రామం వెలుపల ఉన్న ఓ తోటలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు..

పూర్తి వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ దేహత్ లోని లాల్ పూర్ శివరాజ్ పూర్ గ్రామంలో ఒక దళిత బాలిక హత్య తీవ్ర కలకలం రేపింది. ఆమె మృతదేహం గ్రామం వెలుపల ఉన్న తోటలో కనుగొనబడింది. సమీప గ్రామానికి చెందినకరణ్ భడోరియా అనే యువకుడు హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇద్దరు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. .

మంగళవారం సాయంత్రం ఆ అమ్మాయి విశ్రాంతి తీసుకోవడానికి ఇంటి నుండి బయలుదేరింది కానీ రాత్రి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికి, ఉదయం ఆమె మృతదేహాం లభించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు.