Brutal Murder in Arakuloy: అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అరకులోయ పంచాయతీ పరిధిలోని రూప రిసార్ట్స్ వద్ద ఒక యువకుడి హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు నాగేళ్ల సురేష్, 25 సంవత్సరాలు, విజయనగరం జిల్లా తెర్లాం మండలం జన్లివలస గ్రామానికి చెందినవాడు. పోలీసుల సమాచారం ప్రకారం, ఈ హత్య యువతి కోసం జరిగిన ఘర్షణ కారణంగా జరిగినట్లు అనుమానం ఉంది. హెల్మెట్తో కొట్టి, తర్వాత కత్తితో పొడిచి హత్య చేశారు.. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Also: CAFE 3 Rules India: కొత్త నిబంధనలు.. చిన్న కార్ల ధరలకు రెక్కలు..! ఏంటా రూల్స్..?
ఇక, ఘటనా స్థలానికి అల్లూరి జిల్లా డీఎస్పీ పాడేరు అభిషేక్ చేరి కేసును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడు హైదరాబాద్లోని ఓ జువెలరీ షాపులో ఉద్యోగం చేస్తున్నాడు.. అయితే, అతను గతంలో అరకులోయ రిసార్ట్స్లో కూడా పని చేసేవాడు. మరిన్ని వివరాల ప్రకారం, మృతుని భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. ప్రాథమిక దర్యాప్తులో గంజాయి మత్తులో గొడవ జరిగి హత్యకు దారితీసినట్లు వెల్లడైంది. పోలీసులు ఘటనపై పూర్తి వివరాలను సేకరించి, నిందితులపై తగిన చర్యలు చేపట్టనున్నారు.
