Krishna Janmashtami 2026: శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.. ఇస్కాన్ టెంపుల్స్ అయితే.. భక్తులతో కలకలలాడుతున్నాయి.. అయితే, ఈ రోజున బాలకృష్ణుడిని ప్రత్యేకంగా పూజించి, అర్ధరాత్రి ఆయన జన్మ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ. మత విశ్వాసాల ప్రకారం జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ సందర్భంగా కృష్ణునికి సమర్పించాల్సిన ఐదు ముఖ్యమైన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.
1. మఖన్-మిశ్రి
శ్రీకృష్ణుడికి వెన్న అంటే ఎంతో ఇష్టమని పురాణ, మత విశ్వాసాల్లో చెబుతారు. అందుకే జన్మాష్టమి పూజలో బాలగోపాలుడికి వెన్న, మిశ్రి సమర్పించడం ముఖ్యమైన నైవేద్యంగా భావిస్తారు. దీనిని సమర్పించడం వల్ల ఇంట్లో సంతోషం, శాంతి, సానుకూలత నెలకొంటాయని భక్తుల నమ్మకం.
2. కొత్తిమీర పంజిరి
జన్మాష్టమి సందర్భంగా కొత్తిమీర పంజిరిని కూడా శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ అనంతరం దీనిని కుటుంబ సభ్యులకు ప్రసాదంగా పంచడం శుభప్రదంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం పంజిరి శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటిగా చెబుతారు.
3. పంచామృతం
పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపి తయారు చేసే పంచామృతానికి జన్మాష్టమి పూజలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శ్రీకృష్ణుడికి అభిషేకం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. పూజ అనంతరం పంచామృతాన్ని ప్రసాదంగా స్వీకరించడం సంప్రదాయంగా వస్తోంది.
4. తులసి ఆకులు
శ్రీకృష్ణుని పూజలో తులసి ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి విష్ణుమూర్తికి, ఆయన అవతారమైన శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనదని మత విశ్వాసం. అందువల్ల జన్మాష్టమి పూజలో నైవేద్యంతో పాటు తులసి ఆకులను సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.
5. పండ్లు, స్వీట్లు
జన్మాష్టమి రోజున కృష్ణుడికి తాజా పండ్లు, మిఠాయిలు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు తమ స్తోమత, సంప్రదాయం ప్రకారం పేడాలు, లడ్డూలు లేదా ఇతర స్వీట్లను సమర్పించవచ్చు. అనంతరం ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతర భక్తులకు పంచడం ఆనవాయితీ.
వస్తువుల కంటే భక్తి ముఖ్యం
మత విశ్వాసాల ప్రకారం జన్మాష్టమి పూజలో సమర్పించే నైవేద్యాల కంటే భక్తి, విశ్వాసం, స్వచ్ఛమైన మనసు ఎంతో ముఖ్యమైనవి. అందువల్ల శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు పూర్తి భక్తిశ్రద్ధలతో పూజ చేసి, కుటుంబ సభ్యుల సుఖసంతోషాలు, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థించండి.

