Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి.
  2. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 5 రోజులపాటు చర్చ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7న ప్రధాని మోడీ సమాధానం, కరోనా దృష్యా వేర్వేరు సమయాల్లో ఉభయ సభలు సమావేశాలు నిర్వహించనున్నారు. రాజ్యసభ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ జరుగనుంది.
  3. నేడు డ్రగ్స్ కేసులో టోనీని మూడో రోజు పోలీసులు విచారించనున్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం టోనీని 5 రోజుల కస్టడీకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో మరికొందరు బడా బాబుల పేర్లు బయటపడే అవకాశం ఉంది.
  4. పార్లమెంట్ లో నిరసన తెలపాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణకు పిలుపునిచ్చింది. రేపటి నుంచి టీఆర్ఎస్ ఎంపీలు సమావేశాలకు హాజరుకానున్నారు.
  5. నేడు అఖిలపక్షం నేతలతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భేటీ కానున్నారు. సాయంత్రం వర్చువల్ గా వెంకయ్య నాయుడు అఖిలపక్షం నేతలతో భేటీ అవుతారు.
Exit mobile version