నేటి సమాజంలో ఎక్కడ చూసిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులు మాత్రం మారడం లేదు. ఏలూరు సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న జయరాజు తన సహోద్యోగి మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ మేరకు సదరు మహిళా ఉద్యోగి దిశా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రిజిస్టార్ ఆఫీస్లోని ఆడిట్ సెక్షన్లో అటెండర్ గా పనిచేస్తున్న మహిళను రిజిస్ట్రార్ జయరాజు తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేసేవాడు.
దీంతో ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు కూడా జయరాజ్ను మందలించారు. అయినప్పటికీ జయరాజ్ సదరు మహిళను కోరిక తీర్చాలంటూ.. లేకుంటే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగడంతో ఉన్నతాధికారలు సూచనల మేరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.